KCR: నేను బ‌తికుండ‌గా రైతు బంధు ఆగుత‌దా?

Telangana Elections: మంగ‌ళ‌వారం రైతుల ఖాతాల్లో ప‌డాల్సిన రైతు బంధు (rythu bandhu) డ‌బ్బును కాంగ్రెస్ నేత‌లు రేవంత్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి ఆపించేసార‌ని మండిప‌డ్డారు KCR. ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసి ఆపించేసార‌ని.. ఒక్క రైతు బంధుతోనే BRS గెలుస్తుంద‌ని వారు అపోహ‌ప‌డుతున్నార‌ని తెలిపారు. తాను బ‌తికుండ‌గా రైతు బంధు ఆగ‌ద‌ని ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చారు. రేపు ఎన్నిక‌ల త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చాక రైతు బంధు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని తెలిపారు.