KCR: మోదీకి పిచ్చి ప‌ట్టింది..సీఎం పంచ్‌లు

Telangana Elections: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ప్రైవెటీక‌ర‌ణ అనే పిచ్చి ప‌ట్టుకుంద‌ని సెటైర్లు వేసారు సీఎం KCR. ఆయ‌న బాల్కొండ‌లో (balkonda) ఏర్పాటుచేసిన ప్రచార కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. మోదీ అన్నింటినీ ప్రైవెటీక‌ర‌ణ చేయాల‌ని అనుకుంటున్నార‌ని.. విద్యుత్తుని కూడా ప్రైవెటీక‌ర‌ణ చేసి అన్ని ఇళ్ల‌కూ మీట‌ర్లు ఏర్పాటుచేసి ముక్కు పిండి చార్జీలు వ‌సూలు చేయాల‌నుకున్నార‌ని అన్నారు.

కానీ తాను అసెంబ్లీలో ఉన్న‌ప్పుడు ఈ అంశంపై పోరాడాన‌ని.. త‌న త‌ల‌తెగి ప‌డినా స‌రే విద్యుత్తు మీట‌ర్లు పెట్ట‌నివ్వ‌ను అని క‌రాఖండిగా చెప్పాన‌ని అన్నారు. అన్ని ర‌కాల పార్టీలు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నాయ‌ని.. కానీ ఎవ‌రు మంచి చేస్తున్నారు ఎవ‌రు దోచుకుంటున్నారు అని ఆలోచించి ఓటు వేస్తేనే ప్ర‌జ‌ల త‌ల‌రాత మారుతుంద‌ని తెలిపారు. బామ్మర్ది చెప్పాడ‌నో మ‌నం కులం వాడు చెప్పాడ‌నో ఓటును తేలిగ్గా తీసుకుని వేస్తే జీవితాలు నాశ‌నం అవుతాయ‌ని పేర్కొన్నారు.