Narsampet: మీ అయ్య ఇస్త‌డా.. స‌న్నాసి.. KCR పంచ్‌లు..!

Narsampet: నర్సంపేట‌లో సీఎం KCR ఎమ్మెల్యే అభ్య‌ర్ధి సుద‌ర్శ‌న్ రెడ్డితో (sudarshan reddy) పాటు ప్ర‌చార కార్యక్ర‌మంలో పాల్గొన్నారు. ప్ర‌సంగంలో ఆయ‌న కాంగ్రెస్‌పై వేసిన పంచ్‌ల‌కు జ‌నం ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకున్నారు. రైతుల‌కు 24 గంట‌ల క‌రెంట్ ఎందుకు 3 గంట‌లు చాలు అంటున్నార‌ని.. వారికి ఇచ్చే మోట‌ర్ కూడా 10 హెచ్‌పీ మోట‌ర్ ఇస్తే బెట‌ర్ అని అన్నార‌ట‌. దీనిపై KCR స్పందిస్తూ.. రైతులు వాడేది 3 హెచ్‌పీ.. లేదంటే 5 హెచ్‌పీ.. మ‌రి 10 హెచ్‌పీ మోట‌రు మీ అయ్య వ‌చ్చి ఇస్తడా? అన్నారు. దాంతో జ‌నాలు న‌వ్వుకున్నారు.

ఆ త‌ర్వాత క‌ర్ణాట‌క ఉప ముఖ్యమంత్రి డీకే శివ‌కుమార్‌పై (dk shiva kumar) పంచ్ వేసారు. ఆయ‌న తెలంగాణ‌కు వ‌చ్చి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఐదు గంట‌ల క‌రెంట్ ఇస్తామ‌ని స‌వాల్ చేస్తున్నార‌ని.. అరే స‌న్నాసి మేం ఇక్క‌డి 24 గంట‌లు ఇస్తున్నాన‌ని చెప్పాన‌ని KCR అన్నారు.