Paleru: పార్టీకి చేసింది గుండు సున్నా.. పైగా నేను మోసం చేశానట‌!

Telangana Elections: మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు (thummala nageswara rao) ఖమ్మంలో ఓడిపోయి ఇంట్లో ఉంటే మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి, పాలేరులో ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖమ్మంలో ఆయ‌న‌ పార్టీకి చేసింది గుండు సున్నా అని అన్నారు సీఎం kcr. తెలంగాణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న పాలేరులో (paleru) ప్ర‌జా ఆశీర్వాద స‌భ ఏర్పాటుచేసారు. ఈ సంద‌ర్భంగా త‌న‌పై కొంద‌రు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు ధీటుగా స‌మాధాన‌మిచ్చారు KCR. తుమ్మ‌ల పార్టీకి చేసింది ఏమీ లేక‌పోయినా తాను మోసం చేశాను అని చెప్పుకుంటున్నాడ‌ని ఎవ‌రు ఎవ‌ర్ని మోసం చేసారో ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని అన్నారు. కొందరు డబ్బు మదంతో అసెంబ్లీ గేట్ తాకనియ్యను అంటున్నారని.. అలాంటి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు.