KCR: వైర‌ల్ ఫీవ‌ర్.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోనే ట్రీట్మెంట్

తెలంగాణ ముఖ్య‌మంత్రి KCR అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. గత వారం రోజులుగా ఆయ‌న‌ వైర‌ల్ ఫీవ‌ర్, దగ్గుతో బాధపడుతున్నారు. ప్రగతి భవన్‌లోనే సీఎంకు యశోదా ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఐదుగురు వైద్యుల బృందం KCR ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఫీవర్ తగ్గేవరకు అక్కడే వైద్యులు ఉండనున్నారు. సీఎం ఆరోగ్యంపై వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని, కొద్ది రోజుల్లోనే KCR సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెబుతున్నారని, ఆందోళన పడాల్సిన అవసరం ఏమీలేదని మంత్రి KTR తెలిపారు.