KCR: ఇందిర‌మ్మ పాల‌న బాగుంటే NTR పార్టీ ఎందుకు పెడ‌తారు?

Telangana Elections: ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో KCR.. క‌రీంన‌గ‌ర్‌లోని మాన‌కొండూరులో ఏర్పాటుచేసిన స‌భ‌లో మాట్లాడారు. BRS పార్టీ నుంచి ఇక్క‌డ ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ (rasamayi balakrishan) బ‌రిలోకి దిగుతున్నారు. ఈ సంద‌ర్భంగా KCR ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారు. ఇందిర‌మ్మ పాల‌న బాగుండి ఉంటే NTR పార్టీ ఎందుకు పెట్టాల్సి వ‌చ్చింది అని ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్ రాజ్యం అంత దారుణంగా ఉంది కాబ‌ట్టే NTR పార్టీ పెట్టార‌ని.. ఇప్పుడు వీరు మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చి తెలంగాణ‌ను మ‌ళ్లీ 50 ఏళ్లు వెన‌క్కి తీసుకుపోతామంటే విన‌డానికి ప్ర‌జ‌లు పిచ్చివాళ్లు కాదు క‌దా అని ప్రశ్నించారు. క‌రీంన‌గ‌ర్ అమ్మాయినే తాను పెళ్లి చేసుకున్నాన‌ని.. అందుకే త‌న‌కు క‌రీంన‌గ‌ర్‌కు ఎన‌లేని సంబంధం ఉంద‌ని తెలిపారు. క‌రీంన‌గ‌ర్‌తో ఆ అనుబంధం ఉంది కాబ‌ట్టే ఇక్క‌డికి వ‌చ్చి ప్ర‌తీసారి ఏదో ఒక్క కొత్త స్కీం ప్ర‌క‌టిస్తున్నాన‌ని పేర్కొన్నారు.