KCR: సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం యాగం

KCR దంపతులతో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర యాగ సంకల్పం చేయించారు. మూడు రోజులపాటు రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం జ‌ర‌గ‌నుంది. తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి KCR ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం యాగానికి అంకురార్పణ జరిగింది.