KCR: త‌ద్దిన భోజ‌నం రోజూ ఉండాలి అని ఆశీర్వ‌దించిన‌ట్లుంది

Telangana Elections: సీఎం KCR ప్రసంగంలో భాగంగా వ‌రంగ‌ల్ వెస్ట్‌లో (warangal west) విన‌య్ భాస్క‌ర్ కోసం ప్ర‌చారంలో పాల్గొన్నారు. ప్ర‌సంగ స‌మ‌యంలో ఆయ‌న ఒక పంచ్ డైలాగ్ వేసారు. కాంగ్రెస్ (congress) వాళ్లు మ‌ళ్లీ ఇందిర‌మ్మ రాజ్యం తెస్తామంటున్నార‌ని.. వారి రాజ్యంలో ఆక‌లి, ఎన్‌కౌంటర్లు, అవినీతి, క‌రెంట్ కోత‌లు త‌ప్ప ఏమీ లేనప్పుడు మ‌ళ్లీ ఇందిర‌మ్మ రాజ్యం ఎందుకు అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ తీరు ఎలా ఉందంటే.. ఒక ఇంట్లో మ‌నిషి చ‌నిపోతే చుట్టుప‌క్క‌ల వారిని త‌ద్దిన భోజ‌నానికి పిలిస్తే వారు క‌డుపు నిండా తిని.. మీ ఇంట్లో రోజూ ఇలాంటి భోజనం పెడ‌తార‌ని ఆశిస్తున్నాం అని చెప్పిన‌ట్లుంద‌ని KCR మాస్ సెటైర్ వేసారు.