Kavitha: KCR బిడ్డ‌ని ఐనంత‌మాత్రాన ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడ‌తారా?

BRS ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత.. (kavitha) నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌పై (dharmapuri aravind) మండిప‌డ్డారు. బ‌తుకుమ్మ పండుగ జ‌రుపుకునేందుకు నిజామాబాద్ వెళ్లిన క‌విత‌పై అర‌వింద్ ఇష్టారాజ్యంగా మాట్లాడారు. క‌విత‌ చస్తే రూ.10 ల‌క్ష‌లు.. KTR చ‌స్తే రూ.20 ల‌క్ష‌లు అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు.

దీనిపై క‌విత వీడియో ద్వారా స్పందించారు. ఇలా ఆడ‌బిడ్డ‌ల‌ను ఇష్టమొచ్చిన‌ట్లు మాట్లాడేవారు మ‌న‌కు అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నించారు. తాను నిజామాబాద్‌లో ఓడిపోయిన‌ప్ప‌టికీ.. గెలిచిన‌వారికి సపోర్ట్ చేయాల‌ని అనుకున్నాన‌ని.. ఎమ్మెల్సీగా త‌న వంతు ఏదో సాయం చేస్తున్నాన‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ అర‌వింద్ త‌న గురించి త‌న కుటుంబం గురించి ప‌ర్స‌న‌ల్‌గా త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అన్నారు. ఇలాంటి వారు రాజ‌కీయాల్లో ఉంటే ఇక ఆడ‌బిడ్డ‌లు రాజ‌కీయాల్లోకి ఎలా వ‌స్తారు అని ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లో ఇలా ఆడ‌పిల్ల‌ల‌పై ప‌ర్స‌న‌ల్ ఎటాక్స్ చేస్తూ రాజ‌కీయాలు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని.. రాజ‌కీయాలు అన్నాక గెలుపు ఓట‌ములు మామూలేన‌ని అన్నారు. అంత‌మాత్రానికి ఇంత దిగ‌జారాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. (kavitha slams dharmapuri aravind)