Telangana Elections: ఆస్తులు పోయినా కాంగ్రెస్ కోస‌మే ప‌నిచేసాం

Telangana Elections: 18, 20 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన త‌మ‌కు కాంగ్రెస్ పార్టీ మోసం చెసిందని, టికెట్ ఇస్తారు అని ఎంతో ఆశతో ఎదురుచూసినా గొంతు కోసింద‌ని ఆరోపించారు కాటా శ్రీనివాస్ గౌడ్ (kata srinivas goud) స‌తీమ‌ణి సుధ‌. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ నీలం మధుకి టికెట్ కేటాయించారని జగ్గారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నీలం మ‌ధు నుంచి డ‌బ్బు తీసుకుని టికెట్ కేటాయించార‌ని ఆరోపించారు.

ఎవరెవరు ఎంత ఎంత తీసుకున్నారు, ఎవరెవరికి ముట్టాయి వంటి వివ‌రాలు త‌న భ‌ర్త ఢిల్లీ నుంచి వ‌చ్చాక అన్నీ బ‌య‌ట‌పెడ‌తామ‌ని అన్నారు. టికెట్ ఇస్తాం అని ఢిల్లీ పిలిచి నమ్మించి మోసం చేశారని త‌మ‌ ఆస్తులు పోయినా కాంగ్రెస్ జెండా వదలకుండా పని చేశామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. చివరగా త‌మ‌కు కాంగ్రెస్ ఇచ్చిన బహుమానం ఇది అంటూ క‌న్నీరుపెట్టుకున్నారు.