Karnatakaలో అస‌మ్మ‌తి సెగ‌.. స్కెచ్ వేసిన సొంత పార్టీ మంత్రి

Karnataka Politics: కర్ణాటక ప్రభుత్వంలో (karnataka) అస‌మ్మ‌తి సెగ నెల‌కొంది. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాన్ని కూలగొట్టడానికి కాంగ్రెస్ మంత్రి సతీష్ జర్కిహోలీ (satish jarkiholi) ప్ర‌య‌త్నిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తన వారసులకు టికెట్ ఇవ్వట్లేదని ఆగ్రహించిన కాంగ్రెస్ మంత్రి సతీష్ జర్కిహోలీ.. 20 ఎమ్మెల్యేలను తీసుకొని క్యాంప్ రాజకీయం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. విషయం తెలిసిన రణదీప్ సుర్జేవాలా (randeep surjewala) వెంటనే అప్రమత్తమై సతీష్ జర్కిహోలీకి నచ్చజెప్పారు. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వార్త కర్ణాటకలో సంచలనం సృష్టించింది.