ఎంపీ మేడం పెగ్ వేసి ప‌డుకోవాలి..BJP నేత షాకింగ్ కామెంట్స్

Karnataka: క‌ర్ణాట‌క‌కు చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) ఎమ్మెల్యే సంజ‌య్ పాటిల్ .. స్థానిక మ‌హిళా ఎంపీపై చేసిన షాకింగ్ కామెంట్స్ ర‌చ్చ‌కెక్కాయి. ఈసారి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో శిశు మ‌హిళా సంక్షేమ శాఖ మంత్రి ల‌క్ష్మి హెబ్బ‌ల్క‌ర్ (Lakshmi Hebbalkar) కుమారుడు మృణాల్ బెళ‌గావి సీటు నుంచి పోటీ చేయ‌బోతున్నాడు. ఇదే సీటు నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ర‌మేష్ జ‌ర్కిహోలి (Ramesh Jarkiholi) పోటీ చేయ‌నున్నాడు.

ఈ నేప‌థ్యంలో సంజ‌య్ పాటిల్ ల‌క్ష్మీపై కామెంట్స్ చేసారు. ర‌మేష్ బెళ‌గావి నుంచి ప్ర‌చారంలో పాల్గొంటే అత‌నికి వ‌చ్చే మ‌ద్ద‌తు చూసి ఆమెకు నిద్ర‌ప‌ట్ట‌ద‌ని ఆమె నిద్ర‌పోవాలంటే నిద్ర మాత్ర అయినా లేదా ఒక పెగ్ అయినా వేసి ప‌డుకోవాల‌ని అన్నారు. దాంతో ఈ అంశం కాస్తా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సంజ‌య్ పాటిల్ వెంట‌నే ల‌క్ష్మికి క్ష‌మాప‌ణ చెప్పాలంటూ కాంగ్రెస్ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.