Kandigopula Murali: చంద్ర‌బాబు గారూ.. మీ కోసం అన్నీ కోల్పోయాం

kandigopula-murali-alleges-attack-by-jc-prabhakar-reddy

Kandigopula Murali: తెలుగు దేశం పార్టీ నేత జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి అనుచ‌రులు త‌మ ఇంటిపై దాడికి పాల్పడ్డార‌ని ఆరోపిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత కందిగోపుల ముర‌ళి. నిన్న సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో తాను త‌న భార్య ఇంట్లో టీవీ చూస్తుండ‌గా వంద‌లాది మంది జేసీ అనుచ‌రులు దాడి చేసార‌ని తెలిపారు. వెంట‌నే త‌లుపులు వేసుకున్నామ‌ని.. అయినా వారు ఆగ‌కుండా గుణ‌పాల‌తో త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి లోప‌లికి ప్ర‌వేశించార‌ని అన్నారు. దాంతో వారు బెడ్‌రూంలోకి వెళ్లి త‌ల‌దాచుకోగా ఆ త‌లుపులు కూడా బ‌ద్ద‌లుగొడుతుండ‌డంతో వెంట‌నే ఎస్పీ, డీఎస్పీకి ఫోన్ చేసాన‌ని.. వారు రావ‌డంతో తాము ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డామ‌ని అన్నారు.

“” పోలీసుల రాక‌తో వారు పారిపోయార‌ని తెలిసి నేను బ‌య‌టికి వ‌చ్చాను. ఇంకెవ‌రైనా దాడి చేస్తారేమో అని నా ద‌గ్గ‌రున్న లైసెన్స్ తుపాకీని ద‌గ్గ‌ర‌పెట్టుకున్నాను. దీనిపై తెలుగు దేశం పార్టీ త‌ప్పుడు క‌థ‌నాలు వినిపిస్తోంది. నేనే గ‌న్నుతో బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు రాస్తున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. అయ్య చంద్ర‌బాబు నాయుడు గారూ.. మీ తెలుగు దేశం పార్టీ కోసం స‌ర్వ‌మూ పోగొట్టుకున్న కుటుంబాలు మావి. ఈ ఘ‌ట‌న‌పై మీరు నిజాయ‌తీగా విచార‌ణ చేయించాల‌ని కోరుతున్నాను. నా నుంచి త‌ప్పుంటే నాపై కూడా చ‌ర్య‌లు తీసుకోండి. మేం ఎన్ని తిప్ప‌లు పెట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. ఆనాడు తెలుగు దేశం పార్టీ కోసం స‌ర్వ‌స్వం కోల్పోయాం. ఈరోజు జ‌గ‌న్ అన్న కోసం అన్నీ కోల్పోయేందుకు సిద్ధం “” అని వెల్ల‌డించారు.