Telangana: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కమ్మ నాయకుడు!

Telangana: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు మండవ వెంకటేశ్వరరావు పేరు ఖరారైనట్లు సమాచారం. ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్ర‌మార్క సతీమణి నందినికి ఇవ్వకుండా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వకుండా చెక్ పెట్టేందుకు స్థానికేతరుని రంగంలోకి తీసుకొచ్చినట్టు సమాచారం. మండవకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకున్నన్నట్లేనని ఖమ్మం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.