Kavitha: ప‌క్క రాష్ట్రాల మిడ‌త‌ల దండు దాడి చేస్తోంది..!

Kalvakuntla Kavitha: తెలంగాణ‌లో ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు ప‌క్క రాష్ట్రాల‌కు చెందిన కాంగ్రెస్, BJPల సీఎంలు ఇక్క‌డికి వ‌చ్చి ప్ర‌చారం చేస్తున్నార‌ని.. వారిని చూస్తుంటే ప‌చ్చ‌గా పండిన పంట‌ల‌ను చెడ గొట్ట‌డానికి మిడ‌త‌ల దండు దాడి చేస్తున్న‌ట్లుగా ఉంద‌ని అన్నారు BRS ఎమ్మెల్సీ కల్వ‌కుంట్ల క‌విత‌. వారు ఎన్ని తీపి మాట‌లు చెప్పినా ప్ర‌జ‌లు వారి వ‌ల‌లో ప‌డొద్ద‌ని ఓటు వేసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా వేయాల‌ని తెలిపారు. దాదాపు ఈరోజుతో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ముగిసిపోతాయ‌ని.. అందుకే ప్ర‌త్యేకించి ప్ర‌జ‌ల‌కు క్లియ‌ర్‌గా చెప్పాల‌ని ప్రెస్ మీట్ పెట్టాన‌ని పేర్కొన్నారు.