![Kakani Govardhan Reddy slams Somireddy Chandramohan Reddy](https://telugu.newsx.com/wp-content/uploads/2024/06/Kakani-Govardhan-Reddy-slams-Somireddy-Chandramohan-Reddy--500x250.png)
Kakani Govardhan Reddy: రాజకీయాల్లో గెలుపు అనేది ఎప్పుడూ ఒకరివైపే ఉండదని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి కేవలం 23 సీట్లే వచ్చాయని.. ఈసారి తమకు 11 సీట్లే వచ్చినా మళ్లీ ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో గెలుస్తామని అన్నారు. ఈ గెలుపు శాశ్వతం అని తెలుగు దేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని.. అభివృద్ధి ఎలా చేయాలో ఆలోచించకుండా అవినీతికి మాత్రం రోడ్ మ్యాప్ వేసుకున్నాడని ఆరోపించారు. అధికారం ఉంది కదా అని విర్రవీగి తమ పార్టీ నేతలకు సంబంధించిన విగ్రహాలు ధ్వంసం చేయించారని.. మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక ఎవరైతే విరగ్గొట్టారో వారి చేతే ఆ విగ్రహాలను ఏర్పాటుచేయిస్తామని అన్నారు.