KA Paul: గద్ద‌ర్‌ను స‌స్పెండ్ చేసిన పాల్

Hyderabad: ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ (ka paul) గ‌ద్ద‌ర్‌ను (gaddar) స‌స్పెండ్ చేసారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సొంతంగా పార్టీ పెట్టినందుకు ప్రజా శాంతి పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. ప్ర‌జాశాంతి పార్టీలో ఉంటూ దిల్లీకి వెళ్లి వేరే పార్టీ పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించడం ఎంత వ‌ర‌కు న్యాయం అని పాల్ ప్ర‌శ్నించారు. 2022లో గ‌ద్ద‌ర్ ప్ర‌జాశాంతి పార్టీలో చేరి మునుగోడులో ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు. ఆ త‌ర్వాత TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిని (revanth reddy), త‌న కొడుకుని పిలిచి రూ.150 కోట్లు డీల్ ఇచ్చిన‌ట్లు హైకోర్టు సీనియ‌ర్ అడ్వ‌కేట్ ద్వారా త‌న‌కు తెలిసింద‌ని తెలిపారు.