KA Paul: మంత్రులు రేప్ చేయ‌బ‌ట్టే ప్ర‌జ‌లు రేపిస్ట్‌లుగా మారుతున్నారు

ka paul slams telangana ministers

KA Paul: మంత్రులు రేప్ చేయ‌బ‌ట్టే ప్ర‌జ‌లు రేప్ చేస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. తెలంగాణ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేయ‌డంలేదు కాబ‌ట్టి ఆమెపై కోర్టులో కేసు వేయ‌బోతున్నాన‌ని.. ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి డిస్‌క్వాలిఫై చేసే వ‌ర‌కు పోరాడుతూనే ఉంటాన‌ని అన్నారు.

“” య‌థా రాజా త‌థా ప్ర‌జా. రాజు ఎలా ఉంటే ప్ర‌జ‌లు అలా ఉంటారు. మంత్రులు రేప్‌లు చేస్తున్నారు కాబ‌ట్టే ప్ర‌జ‌లు రేప్ చేస్తున్నారు. మంత్రులు దుర్భాష‌లాడుతున్నారు కాబ‌ట్టే ప్ర‌జ‌లు ఒక‌రినొక‌రు కొట్టుకుంటూ తిట్టుకుంటున్నారు. ఈ వ్య‌వ‌స్థ మారాల‌న్న ఉద్దేశంతో నేను కోర్టులో ఫైట్ చేస్తున్నాను. ఇది చాలా త‌ప్పు. మ‌రోప‌క్క ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌త క‌ల్లోలాలు సృష్టిస్తున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు తాను ఒక క్రిస్టియ‌న్ అని అన్నాడు. తాను కూడా బీఫ్ తింటాను త‌ప్పేంటి అన్నాడు. ఇప్పుడేమో స‌నాత‌న ధర్మం అంటున్నాడు. అస‌లు ఆయ‌న ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉండి ఏం చేయాల‌నుకుంటున్నారు “” అని ప్ర‌శ్నించారు.