Chandrababu: విచారణకు విముఖత చూపిన జస్టిస్ ఎస్వీ భట్టి

సుప్రీం కోర్టులో (supreme court) జరుగుతున్న చంద్రబాబు (chandrababu) కేసు విచారణ మరో బెంచికి బదిలీ చేసారు. చంద్రబాబు కేసు విచారణకు జస్టిస్ ఎస్వీ భట్టి విముఖ‌త చూపారు. రేపటి నుండి సెలవులు కావడంతో వచ్చే వారం సుప్రీంకోర్టు విచార‌ణ‌ చేపట్టనుంది. ఏపీ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిష‌న్‌ను ఆ కోర్టు రిజెక్ట్ చేయ‌డంతో దానిని సుప్రీంకోర్టులో స‌వాల్ చేసారు. సుప్రీంకోర్టులో ఈ కేసు 61వ లిస్ట్‌గా ఉంది.