Jithender Reddy: మ‌ళ్లీ ఈటెల‌పై ఆరోప‌ణ‌లు

Hyderabad: BJP మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి (jithender reddy) మ‌రోసారి ఈటెల రాజేంద‌ర్‌పై (etela rajender) ఆరోప‌ణ‌లు చేసారు. ఈటెల సర్పంచ్‌లను, MPTCలను కొనేసాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటున్న జితేందర్ రెడ్డి మరోసారి సొంత BJP నాయకుడిపై అరోపణలు చేశారు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈటెల రాజేందర్ BRS నుండి BJPలోకి రాగానే ఉప ఎన్నికలకు ముందే సర్పంచ్‌లను, MPTCలను కొనేసి ఢిల్లీకి తీసుకొని వెళ్ళాడు అంటూ అరోపణలు చేశారు.