నితీష్‌కి ఆహారంలో విషం పెడుతున్నారు.. మాజీ సీఎం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Jitan Ram Manjhi: బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ (nitish kumar) తినే తిండిలో ఎవ‌రో విషం క‌లుపుతున్నార‌ని మాజీ సీఎం జిత‌న్ రామ్ మాంఝీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. సీఎం ప‌ద‌వి కోసమే ఎవ‌రో ఈ కుట్ర‌కు పాల్ప‌డుతున్నార‌ని అందుకే నితీష్ ఈ మ‌ధ్య‌కాలంలో మ‌తిపోయిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని అన్నారు. విషం ఉన్న ఆహారం తింటున్నారు కాబ‌ట్టే మ‌తిపోయి సంతానోత్ప‌త్తి గురించి.. రిజ‌ర్వేష‌న్ల పెంపు గురించి పిచ్చి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని మాంఝీ అన్నారు.