Jharkhand: 35 మంది ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు తరలింపు!

Jharkhand: ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ అరెస్ట్‌తో ఆ రాష్ట్రంలో రాజ‌కీయ నిప్పు రాజుకుంది. హేమంత్ అరెస్ట్‌తో అప్రమత్తమైన కాంగ్రెస్.. ఎమ్మెల్యేలను కాపాడ‌కునేందుకు వారిని ప్ర‌త్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. 35 మంది ఎమ్మెల్యేలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.