AP Elections స‌మ‌యంలో కొత్త పార్టీ పెట్టిన జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

AP Elections: 2024లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న స‌మ‌యంలో జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ (jd lakshmi narayana) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న కూడా పార్టీని స్థాపించి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌నుకుంటున్నారు. త‌న పార్టీకి జై భార‌త్ (jai bharat) అని పేరు పెట్టారు. దీనిని ల‌క్ష్మీ నారాయ‌ణ జాతీయ పార్టీగా ప్ర‌క‌టించారు. గ‌త ఎన్నిక‌ల్లో జేడీ జ‌న‌సేన (janasena) త‌ర‌ఫున విశాఖ నుంచి ఎంపీ స్థానంలో పోటీ చేసారు. ఈసారి మాత్రం ఇత‌ర పార్టీల నుంచి కాకుండా తానే ఓ పార్టీ పెట్టేస్తే బాగుంటుంద‌ని నిర్ణ‌యించుకున్నారు.