వైఎస్ విజ‌య‌మ్మ‌ను క‌లిసిన జేసీ

jc prabhakar reddy meets ys vijayamma

YS Vijayamma:  ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నం చోటుచేసుకుంది. తెలుగు దేశం పార్టీ నేత జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి.. వైఎస్ విజ‌య‌మ్మ‌ను క‌లిసారు. హైద‌రాబాద్‌లోని విజ‌య‌మ్మ నివాసంలో క‌లిసేందుకు వెళ్లారు. ఆమెను ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. విజ‌య‌మ్మ సొంతూరు తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలోని పెద‌ప‌ప్పూరు మండ‌లం. జేసీది నియోజ‌క‌వ‌ర్గం కూడా తాడిప‌త్రే. అయితే ఓప‌క్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌న‌పై పెట్టిన త‌ప్పుడు కేసుల‌పై పోరాడుతున్న జేసీ.. ఉన్న‌ట్టుండి విజ‌య‌మ్మ‌ను క‌ల‌వ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.