Uday Srinivas: జ‌గ‌నే స్వ‌యంగా పోటీ చేసినా మాకు ల‌క్ష మెజారిటీ త‌గ్గ‌దు

Uday Srinivas: జ‌న‌సేన నేత ఉద‌య్ శ్రీనివాస్ కి గ‌ట్టి కౌంట‌ర్ వేసారు. జ‌న‌సేన త‌ర‌ఫు నుంచి ఉద‌య్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోప‌క్క జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం నుంచి బ‌రిలో దిగ‌నున్నారు. అయితే పిఠాపురంలో ప‌వ‌న్‌ను గెలిపించ‌కుండా ఆల్రెడీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) రెడ్ల‌ను, కాపుల‌ను రంగంలోకి దించి ప‌వ‌న్‌ను ఓడించాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్పటికి మూడు మండలాలకి ముగ్గురు సీనియర్ నాయకులను పంపారు. మూడు కాదు మూడు వందలు కాదు మూడు వేల మందిని అయినా పంపండి, ఏకంగా జగన్ మోహన్ రెడ్డి వచ్చి పోటీ చేసినా ప‌వ‌న్‌కు ల‌క్ష‌ మెజారిటీ త‌గ్గ‌ద‌ని ఉద‌య్ శ్రీనివాస్ అన్నారు. ఎవ‌రెన్ని కుట్ర‌లు ప‌న్నినా తాము చేసుకోవాల్సిన గ్రౌండ్ వ‌ర్క్ అంతా చేసుకుంటున్నామ‌ని తెలిపారు.