Janasena: తిరుప‌తి అభ్య‌ర్ధి మార్పు

Janasena: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) తిరుప‌తి అభ్య‌ర్ధిని మార్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. తిరుప‌తి సీటును ఆర‌ణి శ్రీనివాసులుకు ఇవ్వ‌డంపై ర‌చ్చ రాజుకుంది. ఆర‌ణికి టికెట్ ఇచ్చారు కానీ అత‌ని కోసం తాము ప్ర‌చారంలో పాల్గొనం అని జ‌న‌సేన నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ప‌వ‌న్‌కు వీరాభిమాని అయిన కిర‌ణ్ రాయ‌ల్ తిరుప‌తి నుంచి సీటును ఆశించారు.

కానీ కూట‌మి పొత్తులో భాగంగా ప‌వ‌న్ ఏం చెప్తే దానికి సిద్ధం అంటూ కిర‌ణ్ వెన‌క్కి త‌గ్గారు. ఈ నేప‌థ్యంలో ఈరోజు సాయంత్రం పవ‌న్ క‌ళ్యాణ్ తిరుప‌తికి వెళ్ల‌నున్నారు. సీటు మార్పు విష‌యంపై స్థానిక కీల‌క నేత‌ల‌తో చ‌ర్చించ‌నున్నారు. ముందు అసంతృప్తుల‌ను బుజ్జగించేందుకు పవ‌న్ ప్ర‌య‌త్నించాల‌ని అనుకుంటున్నారు. వారు విన‌క‌పోతే అప్పుడు సీటును వేరొక‌రికి ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈరోజు రాత్రి ఆయ‌న తిరుప‌తిలోనే బ‌స చేయ‌నున్నారు.