Janasena: ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న కామెంట్స్

AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జగ‌న్ స‌ర్కార్ (ap cm jagan) ప్ర‌వేశ‌పెట్టిన వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పై జ‌న‌సేనాని (janasena) ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan)సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేసారు. ఏపీలో 18 వేల మంది అమ్మాయిలు మిస్ అవడానికి కారణం వాలంటీర్లేన‌ని ప‌వ‌న్ అన్నారు. ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి. ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు. ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా. వారిలో వితంతువులు ఉన్నారా.. ఇలాంటి వివ‌రాల‌ను వాలంటీర్లు సేకరించి.. హ్యూమన్ ట్రాఫికింగ్ (human trafficking) చేస్తున్నారని ప‌వ‌న్ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ విషయంపై కేంద్ర నిఘావర్గాలు త‌న‌ను హెచ్చరించాయని, ఇందులో YSRCP పెద్దల హస్తం కూడా ఉంద‌ని ప‌వ‌న్ తెలిపారు.