Janasena: పార్టీ వాలంటీర్ల‌కు ప‌వ‌న్ వార్నింగ్

AP:  జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (janasena) తన వాలంటీర్ల‌కు, పార్టీలో ప‌నిచేసే ఇత‌ర నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు వార్నింగ్ ఇచ్చారు. ఏ రోజు సీట్ల కోసం డబ్బులు తాను ఎవ్వరి ద‌గ్గ‌ర డబ్బులు తీసుకోలేదని చెప్పారు. జ‌న‌సేన‌లో పదవుల ప‌ద‌వులు, సీట్లు, ప‌వ‌న్‌తో ఫొటోలు ఇప్పిస్తాం అంటూ ఎవ‌రైనా డ‌బ్బులు అడిగినా, ఇచ్చినా మీదే బాధ్య‌త అని అన్నారు. ఇవి త‌న‌ దృష్టికి వస్తే మాత్రం బలమైన చర్యలు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు.

“” ఇటీవ‌ల ఓ వ్య‌క్తి వ‌చ్చి స‌ర్ మీతో ఫొటో ఇప్పిస్తాం అని చెప్పి డ‌బ్బులు తీసుకున్నారు స‌ర్ అని చెప్పారు. వాళ్లు అడగ్గానే మీరెందుకు డ‌బ్బులు ఇచ్చారు అని అడిగాను. దానికి వారి ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే ఊరుకునేది లేదు. మ‌న పార్టీలో ఇలాంటి వారికి చోటు లేదు “” అని ప‌వన్ తెలిపారు.