Janasena: రంగు మార్చేసిన నెల్లూరు నేత‌..!

జ‌న‌సేన (janasena) నెల్లూరు నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి (ketamreddy vinod reddy) త‌న కారు రంగును మార్చేసారు. ఒక‌ప్పుడు ఎర్ర రంగు కారుకి జ‌న‌సేన పార్టీ గుర్తు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుర్తుతో ఉన్న కారుకి ఇప్పుడు బ్లూ రంగు వేసి మార్చేసారు. జనసేన కోసం కొన్నేళ్లుగా కష్టపడిన కేతంరెడ్డి.. పొత్తులో భాగంగా తన సీటు ఎక్క‌డ‌ TDPకి వెళ్తుందోన‌ని ముందే ఊహించేసుకొని YSRCP వైపు వెళ్లేందుకు సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య‌కాలంలో జనసేన మీటింగులకి కూడా హాజారవ్వడం ఆపేసార‌ట‌. అయితే YSRCPలో సీటొస్తుందా అంటే.. అక్కడ కూడా కష్టమే. కాకపొతే తాను కష్టపడ్డాను కాబట్టి టికెట్ ఇవ్వనందుకు బాధప‌డుతున్నాను అని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇలాంటి వారు TDPలో, YSRCPలో కూడా చాలా మందే ఉన్నారు. ఏ పార్టీలో కూడా అందరికి సీట్లు సర్దుబాటు చేయలేరు. అధికారం కావాలంటే కచ్చితంగా త్యాగాలు చేయాల్సిందే. కానీ ఈరోజుల్లో త్యాగాలు చేసి ఐదేళ్ల‌ రాజకీయ భవిష్యత్తుని వదులుకోవడానికి ఎవ్వ‌రూ సిద్ధంగా లేరు.