Janasena: ఇక జ‌గ‌న‌న్న గంజాయి ప‌థ‌కం

రోజా  (roja) తన ఇష్టారీతిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌పై (janasena) వ్యాఖ్యలు చేస్తే అంతకంటే ధాటిగా సమాధానం ఇస్తామని తిరుపతి నియోజక వర్గం జనసేన ఇంచార్జ్ శ్రీ కిరణ్ రాయల్ హెచ్చ‌రించారు. సిఎం జగన్మోహన్ రెడ్డిని (ap cm jagan) నమ్ముకుంటే భిక్షం ఎత్తుకోవాల్సిందే అన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, శ్రీలక్ష్మీ జైలుకి పోవడానికి జగన్ కారణం అన్నారు. విజయసాయిరెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి… ముఠా నేత జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లినోళ్లే అని రోజా గుర్తుపెట్టుకోవాలి అన్నారు. ఈసారి మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే జగనన్న గంజాయి పథకం అమలు చేస్తారంటూ ఎద్దేవా చేశారు.

GR, NTR, కరుణానిధి, జయలలిత సినీ రంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని మరిచావా అని రోజాను ప్రశ్నించారు. సినీ రంగంలో నీవు ఎలాంటి పాత్రలు వేశావో గుర్తుందా అని నిలదీశారు.నెలకో ఇళ్లు, నెలకో కారు ఎలా వస్తుందని మంత్రి రోజాను ఓ సీనియర్ మంత్రి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి అన్నారు.మంత్రి రోజాకు ఈసారి నగరి ఎమ్మెల్యే టికెట్ కూడా లేదని, ఆమెతో నగరి మున్సిపాలిటీ ఛైర్మన్ శ్రీమతి శాంతితో జగన్ బలవంతంగా కరచాలనం చేయించడం చూస్తేనే రోజా పరిస్థితి అర్థం అవుతోంది అన్నారు.