Janasena: అడ్డ గాడిదలా బలిసిన గుర్రంపాటి

AP: YSRCP నేత గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి (hurrampati devendra reddy) అడ్డ‌గాడిద‌లా బలిసి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది జ‌న‌సేన (janasena) పార్టీ. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) 2 ల‌క్ష‌ల పుస్త‌కాలు చ‌దివాన‌ని అన్నార‌ని, రోజుకో పుస్త‌కం చ‌దివినా 2 ల‌క్ష‌ల పుస్త‌కాలు చ‌ద‌వ‌డానికి స‌గ‌టు మ‌నిషికి 548 ఏళ్లు ప‌డుతుంద‌ని గుర్రంపాటి ప‌వ‌న్‌పై సెటైర్ వేస్తూ ట్వీట్ చేసారు. దీనిపై జ‌న‌సేన స్పందించింది. అడ్డ‌గాడిద‌లా బ‌లిసిన గుర్రంపాటి.. నీకు దమ్ముంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివాను అని ఎక్కడ మాట్లాడారో ప్రూఫ్ పెట్టాలని సవాల్ విసురుతున్నాము. నీకు ఏ మాత్రం సిగ్గున్నా స‌మాధానం చెప్పాలి. ప్రూవ్ చేయలేక‌పోతే జ‌న‌సైనికులు బహిరంగంగా YCP అడ్డ గాడిద “గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి” అని పిలుస్తారు అని కౌంట‌ర్ వేసారు.