JanaSena: పోల‌వ‌రం.. జ‌గ‌న్ రెడ్డి పాపాల వ‌రం!

AP: పోల‌వ‌రం (polavaram) ప్రాజెక్ట్ ఏపీ సీఎం జ‌గ‌న్ (ap cm jagan) పాపాల వ‌రం అంటూ విమ‌ర్శ‌లు గుప్పించింది జ‌న‌సేన పార్టీ (janasena). పోలవ‌రం ప్రాజెక్ట్‌లో స్పిల్‌వే ఎగ‌మ‌వైపు నిర్మిస్తున్న గైడ్ బండ్ కుంగిపోయింది. దాంతో పోలవ‌రం ప్రాజెక్ట్ నాణ్య‌త విష‌యంలో అనుమానాలు ఉన్నాయ‌ని జ‌న‌సేన ఆరోపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు డివాల్ గైడ్ బండ్ కూలితే బయటపెట్టకుండా నాటకాలు ఆడుతోందని మండిప‌డింది. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పరిశీలన, సమీక్ష మీడియా సమక్షంలో జరగాలని డిమాండ్ చేసింది. ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు తగ్గించడానికి ఒప్పుకుంది నిజం కాదా? అని ప్ర‌శ్నించింది. కేంద్రం వద్ద YCP ప్రభుత్వం చేసిన ఒప్పంద సంతకాలు ఉన్నాయని పోలవరం జగన్ రెడ్డి పాపాల వరం పథకం అయ్యిందని గుంటూరు పార్టీ కార్యాలయంలో జనసేన (janasena) పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadendla manohar) తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.