Jagga Reddy: ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను నేనే వ‌ద‌ల్లేక‌పోయా.. ఇక KCR KTR ఎలా త‌ట్టుకుంటారు?

jagga reddy says kcr and ktr are not able to digest defeat

Jagga Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో BRS నేత‌లు KCR, KTR, హ‌రీష్ రావుల‌కు ఏం చేయాలో అర్థంకావ‌డం లేద‌ని సెటైర్ వేసారు కాంగ్రెస్ నేత జ‌గ్గా రెడ్డి. ప‌దేళ్ల పాటు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లాంటి ఇంద్ర‌భ‌వ‌నంలో రాజ‌భోగాలు అనుభ‌వించి ఇప్పుడు ఇళ్ల‌కే ప‌రిమితం కావ‌డంతో వాళ్లు మ‌తిస్థిమితం కోల్పోయార‌ని అన్నారు. అందుకే అరికెపూడి గాంధీపై రెచ్చిపోయి ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలిపారు.

తాను ఇటీవ‌ల ప‌ని మీద ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌కు క‌లిసేందుకు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లాన‌ని.. మీటింగ్ అనంత‌రం ఆ భ‌వ‌న్‌ను వ‌దిలి రాలేక‌పోయాన‌ని.. అలాంటిది ప‌దేళ్ల పాటు ఆ భ‌వ‌నంలో రాజ‌భోగాలు అనుభ‌వించిన కేసీఆర్, కేటీఆర్‌, హ‌రీష్ రావు ఓట‌మిని జీర్ణించుకోలేక ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను చాలా మిస్స‌వుతున్నార‌ని చుర‌క‌లు అంటించారు. ఇక హ‌రీష్ రావుకి బీఆర్ఎస్ నేత‌ల‌కు ఎలుగుబంటి క‌రిచిన‌ట్లుంద‌ని.. ఒక ఎలుగుబంటికి చిరాకు వ‌స్తే అది మొత్తం పెంట పెంట చేస్తుంట‌ద‌ని.. అలా బీఆర్ఎస్ నేత‌లు తెలంగాణ‌ను పెంట చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.