Jagan: మ‌ళ్లీ కొడ‌దాం.. పార్టీ నేత‌ల‌తో జ‌గ‌న్ వ్యాఖ్య‌లు

jagan speaks to ysrcp leaders about bouncing back again

Jagan: మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. గెలిచిన వారికి జ‌గ‌న్ అభినంద‌న‌లు తెలియ‌జేసారు. గెల‌వ‌ని వారికి నిరుత్సాహపడొద్ద‌ని ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. అయితే పార్టీ నేత‌ల‌ను జ‌గ‌న్ పిలిపించి మాట్లాడ‌లేదు. ఆయ‌న త‌న నివాసంలోని అధికారిక గ‌దిలో ఉంటే పార్టీ నేత‌లంతా ఒక్క‌సారిగా లోప‌లికి వెళ్లిపోయార‌ట‌. దాంతో వారికి కూర్చోవ‌డానికి స‌రైన ఏర్పాట్లు చేయ‌లేక‌పోయార‌ని తెలుస్తోంది.

జ‌గ‌న్‌తో మ‌ళ్లీ ఎప్పుడు ఇలా ప్ర‌త్య‌క్షంగా మాట్లాడ‌తామో అని చాలా మంది నేత‌లు త‌మ‌కున్న బాధ‌ల‌ను తెలియ‌జేసారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప‌ట్టున్న గ్రామాల్లో కూడా ఓట్లు ప‌డ‌లేదంటే ఈవీఎంల‌పై అనుమానాలు ఉన్నాయ‌ని.. దీని గురించి లోతుగా విచార‌ణ చేయించాల్సి ఉంద‌ని చెప్పార‌ట‌. దీనికి జ‌గ‌న్ స‌మాధాన‌మిస్తూ.. త‌న‌కు కూడా అనుమానాలు ఉన్నాయ‌ని.. కాక‌పోతే ఆధారాలు లేక‌పోవ‌డంతో ఇప్పుడు చేయ‌డానికి ఏమీ లేద‌ని తెలిపారు. మ‌ళ్లీ ఐదేళ్ల త‌ర్వాత క‌చ్చితంగా గెలుస్తామ‌ని.. అప్ప‌టివ‌ర‌కు అధైర్య ప‌డ‌కుండా ప్ర‌తిప‌క్ష హోదాలో అధికార పార్టీని ప్ర‌శ్నిద్దామ‌ని వారికి తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం. మ‌రో రెండు రోజుల్లో జ‌గ‌న్ పార్టీ నేతలంద‌రి కోసం ఓ ప్ర‌త్యేక‌మైన స‌మావేశాన్ని ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.