Jagan: వివేకాను ఎవ‌రు చంపారో అంద‌రికీ తెలుసు

Jagan: వైఎస్ వివేకానంద రెడ్డిని (YS Vivekananda Reddy) ఎవ‌రు చంపారో అంద‌రికీ తెలుస‌ని.. హంత‌కుడిని జైల్లో పెట్టించ‌కుండా నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నార‌ని అన్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఇడుపుల‌పాయ నుంచి బ‌స్సు యాత్ర‌ను ప్రారంభించిన జ‌గ‌న్ అక్క‌డి ప్ర‌జ‌ల మ‌ధ్య ప్ర‌సంగించారు. ఈ ప్రసంగం స‌మ‌యంలో వివేకా హ‌త్య కేసు గురించి ప్ర‌స్తావించారు.

“” వివేకాను ఎవ‌రు చంపారో ఎవ‌రు చంపించారో ఆయ‌నకు ఆ దేవుడికి క‌డ‌ప ప్ర‌జ‌ల‌కు తెలుసు. ఇంకా ఆశ్చ‌ర్యం ఏంటంటే.. ఎవ‌రైతే చిన్నాన్న‌ను అతి దారుణంగా చంపి ఆ హంత‌కుడికి మ‌ద్ద‌తు ఇస్తున్నారో మీరు రోజూ చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైలులో. కానీ అత‌నికి మ‌ద్ద‌తిస్తూ నెత్తిన పెట్టుకుని నిస్సిగ్గుగా మ‌ద్ద‌తు ఇస్తున్నారంటే దీని అర్థం ఏంట‌ని అడుగుతున్నా “” అని తెలిపారు.

ALSO READ: “సిద్ధం” వల్ల వైసీపీకి తీవ్రమైన డ్యామేజ్?