Jagan: స‌ర్ అమ్మ‌వ‌డి.. జ‌గ‌న్ ప్రెస్‌మీట్‌లో వింత‌

jagan slams chandrababu naidu again

Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై తెలుగు దేశం పార్టీ క‌ర్క‌శం చూపిస్తోంద‌ని మ‌రోసారి ఆరోప‌ణ‌లు చేసారు. త‌న పార్టీ కార్య‌కర్త‌పై మ‌రో దాడి జ‌రిగింద‌ని ఆరోపిస్తూ ఈరోజు మీడియా ముందుకొచ్చారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఓ వింత ఘ‌ట‌న చోటుచేసుకుంది. సాధార‌ణంగా ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న పార్టీ నేత‌లు అధికార హోదాలో ఉన్న పార్టీపై ఆరోప‌ణ‌లు చేయ‌డానికి స్క్రిప్ట్ రెడీ చేసుకుని మ‌రీ రారు. వారికి అప్ప‌టిక‌ప్పుడు మాట‌లు వ‌చ్చేస్తుంటాయి.

కానీ జ‌గ‌న్ విష‌యంలో ఆ స్పాంటేనియ‌స్ స్పీచ్ ఇవ్వ‌గ‌ల స‌త్తా లేద‌ని ఈరోజు మ‌రోసారి రుజువైంది. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ ప‌థ‌కాలు ఇంకా అమ‌లు చేయ‌లేద‌ని చెప్తున్న స‌మ‌యంలో.. ప‌క్క నుంచి ఓ వ్య‌క్తి స‌ర్‌.. అమ్మ‌వ‌డి అని గుర్తుచేసాడు. దాంతో జ‌గ‌న్ అమ్మ‌వ‌డి గురించి ప్ర‌స్తావించ‌డం మొద‌లుపెట్టారు. అలా అన్ని విమ‌ర్శ‌లు చేసేసిన త‌ర్వాత మీడియా ఓ ప్ర‌శ్న అడిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో చంపబడ్డారు అని ఆరోపిస్తున్న 36 మంది మృతుల‌ పేర్లు వివ‌రాలు అడ‌గ్గా.. స‌మాధానం చెప్ప‌కుండా ఏమో నాకు తెలీదు అన్న‌ట్లు న‌మ‌స్కారం పెట్టి జ‌గన్ వెళ్లిపోవ‌డం వైర‌ల్‌గా మారింది.