Jagan: చెల్లెమ్మ ఎంట్రీ.. స్పందించిన జ‌గ‌న్

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) తొలిసారి చెల్లెలు ష‌ర్మిళ ఏపీ ఎంట్రీ ఇవ్వ‌డంపై స్పందించారు. ష‌ర్మిళ త‌న పార్టీని ప‌క్క‌న పెట్టి కాంగ్రెస్‌లో చేర‌బోతున్నారు. ఆమెను కాంగ్రెస్ ఏపీ అధ్య‌క్షురాలిగా చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఓ స‌మావేశంలో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కొన్ని పార్టీలు త‌న కుటుంబాన్ని చీల్చ‌బోతున్నాయని అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. త‌న చెల్లి ఏపీలో అడుగుపెట్టింది కాబ‌ట్టి ఎక్క‌డ త‌న నేత‌ల‌ను లాగేసుకుంటారేమోన‌ని జ‌గ‌న్ బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.