Jagan: నేనున్నా.. మ‌న‌ల్ని ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు..!

jagan says nobody can touch ysrcp cadre

Jagan: నేనున్నా.. మ‌న‌ల్ని ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గన్ మోహ‌న్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లతో అన్నారు. ఈరోజు జ‌గ‌న్ లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ ఎంపీల‌ను క‌లిసారు. ఈ సంద‌ర్భంగా వారితో మాట్లాడుతూ.. పార్ల‌మెంట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు బ‌లం ఎక్కువగానే ఉంద‌ని న‌లుగురు లోక్ స‌భ‌లో 14 మంది రాజ్య‌స‌భ‌లో ఉన్నార‌ని అన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో నేత‌ల్లో ధైర్యం స‌న్న‌గిల్ల‌కూడ‌ద‌ని పోరాట ప‌టిమ త‌గ్గ‌కూడ‌ద‌ని సూచించారు. త‌న వ‌య‌సు చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ స‌త్తువ మాత్రం ఎక్కువే ఉంద‌ని అన్ని ర‌కాల పోరాటాలు చేసే శ‌క్తి ఉంద‌ని అన్నారు.