Jagan: ఢిల్లీలో ధ‌ర్నా చేస్తా.. చంద్ర‌బాబు సీఎం అయ్యాక ద‌రిద్రం చుట్టుకుంది

jagan says he will do dharna in delhi

Jagan: ఢిల్లీలో ధ‌ర్నా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయినప్ప‌టి నుంచి రాష్ట్రానికి దరిద్రం చుట్టుకుంద‌ని.. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం లేకుండాపోయింద‌ని అయ‌న అన్నారు. వ‌చ్చే బుధ‌వారం (జులై 24) ఢిల్లీలో శాంతియుతంగా ఢిల్లీలో ధ‌ర్నా చేప‌డ‌తాన‌ని అన్నారు. ప్ర‌ధాని నరేంద్ర మోదీ, కేంద్ర‌మంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్స్ కూడా కోరాన‌ని .. కొత్త ప్ర‌భుత్వం రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం పాడైపోతుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోద‌ని తెలిపారు.