Jagan Mohan Reddy: మ‌కాం మార్చ‌నున్న జ‌గ‌న్‌… ఐదేళ్లు అక్క‌డే నివాసం

Jagan Mohan Reddy to stay in karnataka for the next five years

Jagan Mohan Reddy:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌కాం మార్చ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్న‌ప్పుడు తాడేప‌ల్లిగూడెంలో.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నప్పుడు హైద‌రాబాద్‌లో ఉండే జ‌గ‌న్.. ఇప్పుడు ఈ రెండు ప్రాంతాలు త‌న‌కు త‌గిన‌వి కావు అని అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట‌. అధికారంలో ఉన్నంత వ‌ర‌కు తాడేప‌ల్లిగూడెంలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌తో క‌ట్టించుకున్న ఇంట్లో ఉండేవారు. అధికారంలో లేన‌ప్పుడు మాత్రం హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్‌లో ఉన్న ఇంట్లో ఉండేవారు.

అయితే ఇప్పుడు తాడేప‌ల్లి నివాసంలో ఉండ‌టం అంత సుర‌క్షితం కాద‌ని.. తాన‌పై నిఘా ఉంచార‌ని జ‌గ‌న్ అనుమానిస్తున్నార‌ట‌. పోనీ హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో ఉందామంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలుగు దేశం పార్టీకే స‌పోర్ట్ చేస్తున్నార‌ని భావించి హైద‌రాబాద్ కూడా అనువైన నివాసం కాద‌ని అనుకుంటున్నార‌ట‌. దాంతో క‌ర్ణాట‌క‌లోని యల‌హంకలో ఉన్న త‌న నివాసానికి షిఫ్ట్ అయ్యేందుకు జ‌గ‌న్ ప్లాన్ వేస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు య‌ళ‌హంక‌లోనే ఉండి అన్ని ప‌నులు చూసుకుంటార‌ని తెలుస్తోంది. దాదాపు ప‌దేళ్లుగా జ‌గ‌న్ క‌ర్ణాట‌క‌లోని త‌న నివాసంలో ఉన్న‌ది లేదు.