జ‌గ‌న్‌కు షాక్.. తాడేపల్లిలో ఆఫీస్ కూల్చివేత

Jagan Mohan Reddy tadepalli office is demolished

Jagan Mohan Reddy: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చెందిన తాడేప‌ల్లిలోని కార్యాల‌య భ‌వ‌నాన్ని అధికారులు కూల్చేసారు. ఈ ఆఫీస్ కోసం ఎక‌రానికి రూ.1000 చొప్పున రెండు ఎక‌రాల‌ను 33 ఏళ్ల‌కు లీజ్‌కి తీసుకున్నార‌ట‌. బోటు యార్డు స్థ‌లంలోనే జ‌గ‌న్ కార్యాల‌యం క‌ట్టించారు. మ‌ళ్లీ తానే అధికారంలోకి వ‌స్తాన‌నుకుని ఈ క‌ట్ట‌డాన్ని చేప‌ట్టారు. ప్ర‌భుత్వం మార‌డంతో వెంట‌నే ఈ కార్యాల‌యాన్ని ప‌డ‌గొట్టాల‌ని అధికారులు ఆదేశించారు.