Jagan Mohan Reddy: క‌ళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోతాయ్.. మ‌ళ్లీ వ‌చ్చేది మ‌న‌మే

Jagan Mohan Reddy says tdp janasena and bjp are enjoying honey moon

Jagan Mohan Reddy: క‌ళ్లు మూసుకుని తెరిచే లోగా ఐదు సంవ‌త్స‌రాలు పూర్త‌యిపోతాయ‌ని.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వ‌చ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వమే అని అన్నారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి . తెలుగు దేశం పార్టీ, జ‌న‌సేన‌, భారతీయ జ‌న‌తా పార్టీలు గెలిచేయ‌డంతో ప్ర‌స్తుతం హ‌నీమూన్ ఎంజాయ్ చేస్తున్నార‌ని అన్నారు. ఎమ్మెల్సీల‌తో జ‌గ‌న్ ఈరోజు త‌న కార్యాల‌యంలో స‌మావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వారితో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయని ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. ప్ర‌స్తుతం తెలుగు దేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీల హ‌నీమూన్ న‌డుస్తోంద‌ని వారికి మ‌రికొంత స‌మయం ఇద్దామ‌ని తెలిపారు. 40 శాతం ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపే ఉన్నారని అధికార పార్టీల‌ ప్రలోభాలకు లొంగొద్దని సూచించారు.