రాజ‌కీయాల్లో ఇంత నిజాయ‌తీగా ఉండ‌కూడ‌దు అంటున్న జ‌గ‌న్

jagan mohan reddy says chandrababu naidu will get single digit seats in next elections

Jagan Mohan Reddy: రాజ‌కీయాల్లో ఇంత నిజాయ‌తీ పనికిరాద‌ని.. అయినా స‌రే తాను ధ‌ర్మబ‌ద్ధంగానే పోరాడాల‌ని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఈరోజు పార్టీ నేత‌ల‌తో విస్తృత స‌మావేశంలో జ‌గ‌న్ పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో వారితో మాట్లాడుతూ.. రాజ‌కీయాల్లో ఇంత నిజాయ‌తీగా ఉండకూడ‌ద‌ని అర్థ‌మైంద‌ని.. అయినా స‌రే తాను ధ‌ర్మ‌బ‌ద్ధంగానే పోరాడాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపారు. చంద్ర‌బాబు నాయుడుకు సింగిల్ డిజిల్ సీట్లు వ‌చ్చే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని అన్నారు. ఈ ఓట‌మి కేవ‌లం త‌న‌కు ఇంట‌ర్వెల్ లాంటిద‌ని మ‌ళ్లీ అర్జునుడిగా గెలిచి వ‌స్తాన‌ని శ‌ప‌థం చేసారు.