Jagan: ద‌య‌చేసి ఈనాడు, ABN, TV5 చ‌ద‌వ‌కండి.. చూడ‌కండి

Jagan: ద‌యచేసి ఈనాడు, టీవీ 5, ఏబీఎన్ ప‌త్రిలు, ఛానెళ్లు చూడ‌కండి అని ఏపీ ప్ర‌జ‌ల‌ను వేడుకున్నారు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. తుఫాను కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకునేందుకు క‌లెక్ట‌ర్ల‌తో స‌మావేశం అయ్యారు. క‌లెక్ట‌ర్ల ద్వారా ప్ర‌జ‌ల‌కు సాయం అందాల‌ని కోరుతూ.. కొన్ని చానెళ్లు తను మంచి చేసినా త‌ప్పే అని చెప్తున్నాయ‌ని అన్నారు. అలాంటి టీవీ ఛానెళ్లు చూడ‌కండి అని రిక్వెస్ట్ చేసారు.

కాబ‌ట్టి రైతులు ఎవ‌రైనా మీకు ఏపీ ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి సాయం అంద‌దు అని చెప్తే న‌మ్మ‌కం అని రైతుల‌కు పిలుపునిచ్చారు. ఇప్పుడు తాను చంద్ర‌బాబు నాయుడుతోనే కాకుండా ప‌నిక‌ట్టుకుని అబద్ధాలు ప్ర‌చారం చేస్తున్న టీవీ ఛానెళ్ల‌తోనూ యుద్ధం చేస్తున్నాన‌ని తెలిపారు.