Jagan Mohan Reddy: కాంగ్రెస్‌లో పార్టీ విలీనం.. డీకే శివకుమార్‌తో చర్చలు జరిపిన జగన్!

Jagan Mohan Reddy planning to merge ysrcp in congress

Jagan Mohan Reddy:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గన్ మోహ‌న్ రెడ్డి షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. నిన్న పులివెందుల నుంచి హెలికాప్ట‌ర్‌లో స‌తీమణి భార‌తితో క‌లిసి బెంగళూరు వెళ్లిపోయిన జ‌గ‌న్.. క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్‌ను క‌లిసార‌ట‌. త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాల‌నుకుంటున్న‌ట్లు చ‌ర్చించార‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి త‌న పార్టీని విలీనం చేయాలంటే APCC చీఫ్‌.. త‌న సొంత చెల్లెలు వైఎస్ ష‌ర్మిళ‌ను పార్టీ నుంచి తొల‌గించాల‌ని కోరిన‌ట్లు రామకృష్ణ తెలిపారు. త‌న‌తో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంత మంది త‌న‌తో ప్ర‌యాణం చేస్తారో తెలీని ప‌రిస్థితిలో తానున్న‌ట్లు జ‌గ‌న్ శివ‌కుమార్‌ను క‌లిసార‌ని అన్నారు.