Jagan: ఎన్నికల్లో ఓటమి ఇంటర్వెల్ మాత్రమే

jagan mohan reddy held meeting with ysrcp party leaders

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గన్ మోహ‌న్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌తో విస్తృత స‌మావేశంలో పాల్గొన్నారు. రేప‌టి నుంచి అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోని తాము ఎలా మాట్లాడాలి ఎలా మ‌సులుకోవాలి అని జ‌గ‌న్ వారికి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌తో ఎన్నిక‌ల ఫ‌లితాల గురించి మాట్లాడుతూ.. “” ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ అనిపించింది. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తుకు వచ్చింది. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేం. ఎన్నికల్లో ఓటమి ఇంటర్వెల్ మాత్రమే. కోట్ల మంది ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. TDP దాడిలో నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి భరోసా ఇస్తా “” అని మ‌ళ్లీ మ‌ళ్లీ పాత పాటే అందుకున్నారు.