Jagan Mohan Reddy: వ‌ర‌ద బాధితుల‌కు జ‌గ‌న్ విరాళం

Jagan Mohan Reddy donates 1 crore to vijayawada flood victims

Jagan Mohan Reddy: విజ‌య‌వాడ వ‌ర‌ద బాధితుల‌కు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భూరి విరాళం అంద‌జేసారు. రూ. కోటి రూపాయ‌లు విరాళంగా ప్ర‌క‌టించారు. ఎప్పుడూ లేనిది జ‌గ‌న్ నిన్న వ‌ర‌ద నీటిలోకి దిగి మ‌రీ బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో ఓ బాధితురాలి వ‌ద్ద‌కు వెళ్లి ఏమ్మా మీకు స‌హాయం అందిందా అని అడ‌గ్గా.. పీక‌ల్లోతు నీటిలో ఉన్నాం. వారైనా ఎలా వ‌స్తారు స‌ర్? చేసిన కాడికి సాయం అందించారు అని చెప్పింది. ఆ స‌మాధానం విని జ‌గ‌న్ న‌వ్వుకుంటూ వెళ్లిపోవ‌డం వైర‌ల్‌గా మారింది.