Jagan Mohan Reddy: మ‌హిళా రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌.. త‌ప్పించుకున్న జ‌గ‌న్

Jagan Mohan Reddy dharna in delhi

Jagan Mohan Reddy:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీలో ధ‌ర్నా చేప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డి జాతీయ మీడియాతో స‌మావేశం అయ్యారు. ఈ 45 రోజుల పాల‌న‌లో ఎన్ని హ‌త్య‌లు, దారుణాలు జ‌రిగాయో అన్నీ ఫోటోలు తెచ్చామ‌ని.. ఒక‌సారి వాటిని చూసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాల‌ని మీడియా వారు కూడా ప్ర‌చారం చేయాల‌ని కోరారు.

ఈ నేప‌థ్యంలో ఓ మ‌హిళా రిపోర్ట‌ర్ వేరే అంశం గురించి ప్ర‌శ్నించ‌గా.. ద‌య‌చేసి తాము ఏ విష‌యం గురించైతే ధ‌ర్నా చేస్తున్నామో దానిపై మాత్ర‌మే ఫోక‌స్ చేయాల‌ని.. టాపిక్ డైవ‌ర్ట్ చేయొద్ద‌ని అన్నారు. మీ ఇంటికి వ‌చ్చి ధ‌ర్నా చేసి మిమ్మ‌ల్ని కొట్టి చంపేస్తుంటే ఊరుకుంటారా? ఒక‌సారి బాధితుల స్థానంలో మీరు ఉండి ఆలోచించండి అని స‌మాధానం ఇచ్చారు. మ‌రో ప్ర‌శ్న వేస్తుంటే స‌మాధానం చెప్ప‌కుండా ఒక‌సారి ఫోటోలు చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పి వెళ్లిపోయారు.