Jagan: చెల్లికి చెప్ప‌మ్మా..!

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామ‌ర్శించేందుకు హైద‌రాబాద్ చేరుకున్నారు. ఆ త‌ర్వాత లోట‌స్ పాండ్‌లో ఉంటున్న త‌న త‌ల్లి విజ‌య‌మ్మ నివాసానికి వెళ్లారు. త‌ల్లితో కాసేపు ముచ్చ‌టించి బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. అక్క‌డి నుంచి తిరిగి విజ‌య‌వాడ వెళ్లిపోయారు.  అయితే త‌న త‌ల్లిని క‌లిసిన జ‌గ‌న్.. చెల్లెలికి నువ్వైనా చెప్ప‌మ్మా అని త‌న బాధ‌ను చెప్పుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈరోజు త‌న పార్టీని ష‌ర్మిళ కాంగ్రెస్‌లో విలీనం చేసింది. ఏపీ రాజ‌కీయాల్లో త‌న చ‌క్రం తిప్ప‌బోతున్న ష‌ర్మిళ నుంచి జ‌గ‌న్‌కు వ్య‌తిరేకత ఏర్ప‌డుతోంది. జ‌గ‌న్ పార్టీకి చెందిన నేత‌లు నెమ్మ‌దిగా ష‌ర్మిళ వైపు వెళ్లిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌న త‌ల్లితో అన్ని బాధ‌లు చెప్పుకుని ష‌ర్మిళ‌తో మాట్లాడాల‌ని కోరార‌ట‌.