Jagan: అసెంబ్లీకి వెళ్దాం.. తాడో పేడో తేల్చుకుందాం

jagan asks winning mla's to come to assembly sessions

Jagan: ఈనెల 21, 22న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయి ప్ర‌తిప‌క్ష హోదాను కూడా ద‌క్కించుకోలేక‌పోయిన జ‌గ‌న్ అసెంబ్లీకి వ‌స్తారో లేదో అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో నిన్న జ‌గ‌న్ పార్టీ కేడ‌ర్‌తో స‌మావేశం అయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలు అంతా అసెంబ్లీకి రావాల‌ని.. తాడో పేడో అసెంబ్లీలోనే తేల్చుకోవాల‌ని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేదు కాబ‌ట్టి అధికార పార్టీ మాట్లాడేందుకు కూడా అవ‌కాశం ఇవ్వ‌ర‌ని.. అయినా ఏదో ఒక ర‌కంగా ప్ర‌జ‌ల కోసం పోరాడాల‌ని జ‌గ‌న్ నేత‌ల‌తో అన్నారు. అసెంబ్లీ స‌మావేశాలు అయ్యాక జ‌గ‌న్ పులివెందుల వెళ్ల‌నున్నారు. అయితే అసెంబ్లీలో జ‌గ‌న్‌కు ఏ సీటును కేటాయిస్తారు అనే అంశంపై కూడా స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.